Hot Posts

6/recent/ticker-posts

అక్రమంగా గోవులను తరలిస్తున్న వ్యాన్ పట్టుకున్న సీఐ వై ఆర్ కె శ్రీనివాస్

 చూసే వాళ్ళందరికీ గుమ్మడికాయలు తరలిస్తున్నట్టుగా బిల్డప్ లోడు అడుగు బాగాన చూస్తే పుష్ప మాదిరిగా గోవులు అక్రమ తలలింపు అవాక్కైనా పోలీసు సిబ్బంది

కాకినాడ జిల్లా ఎస్పీ . బిందు మాధవ్  వారికి రాబడిన సమాచారం మేరకు ఈ రోజు జగ్గంపేట సి ఐ వై ఆర్ కె శ్రీనివాస్ మరియు కిర్లంపూడి ఎస్సై  జి సతీష్  కిర్లంపూడి మండలం  కృష్ణవరం టోల్ ప్లాజా వద్ద ఒక కూర గుమ్మడి కాయలు లోడ్ వ్యాన్ పట్టుకుని తనిఖీ చేయగా  గుమ్మడికాయల లోడు అడుగుభాగాన అక్రమంగా తరలిస్తున్న గోవులను

పట్టుకున్నారు రెండు గోవులు ఎనిమిది దూడలు పట్టుకొని ముద్దాయిని అరెస్ట్ చేసి కేసు నమోదు చేసి వ్యాను ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. అని సి ఐ వై ఆర్ కే శ్రీనివాస్ తెలియజేశారు