కాకినాడ జిల్లా జగ్గంపేట: రావులమ్మ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో జగ్గంపేట కు చెందిన నృత్య కళాకారిణి ముళ్ళ పూడి ఈశ్వరిని జగ్గంపేట శాసనసభ్యులు, టిటిడి బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ సాల్వతో సత్కరించి ఆశీస్సులు అందించారు, ఈనెల 7వ తేదీన తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన మండపం నాదనీరాజనంలో కూచిపూడి ప్రదర్శనతో వెంకటేశ్వర స్వామి వారికి నాదనీరాజనం సమర్పించిన చిరంజీవి ఈశ్వరీ ని డాన్స్ టీచర్ ముళ్ళ పూడి విజయలక్ష్మి అభినందించి శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో కూచిపూడి నాట్యం ప్రదర్శించిన చిరంజీవి ఈశ్వరి జాతీయంగానే అంతర్జాతీయంగా కూడా ప్రదర్శన ఇచ్చి జగ్గంపేటకు మంచి పేరు తీసుకురావాలని దీవించారు. ఈ కార్యక్రమంలో జగ్గంపేట మార్కెట్ కమిటీ చైర్మన్ ఆడప భరత్ బాబు, రేఖ బుల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.