కాకినాడ జిల్లా జగ్గంపేట: ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆదేశాలతో,రాష్ట్ర టిడిపి కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు,జగ్గంపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ మహిళా శక్తి కమిటీ మహిళల ఆధ్వర్యంలో రాజధాని అమరావతిపై జగన్ అండ్ బ్యాచ్ మరోసారి విషం చిమ్మింది అని అమరావతి రాజధాని మహిళలను తీవ్రంగా కించపరచడమే లక్ష్యంగా బరితెగించింది అని అమరావతి వేశ్యల రాజధాని అంటూ రోత చానల్లో జర్నలిస్టుల ముసుగులో ఉన్న వ్యక్తులు శనివారం ఉదయం లైవ్ డిబేట్లో నోరుపారేసుకున్నారు అని వెంటనే దోషులైనటువంటి వారందరినీ అరెస్టు చేసి మహిళలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలియజేసి జగ్గంపేట పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్ టి. రఘునాధరావుకి ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా మహిళ నేతలు మాట్లాడుతూ కొమ్మినేని శ్రీనివాసరావు (కేఎస్ఆర్) నిర్వహించిన డిబేట్లో పాల్గొన్న జర్నలిస్టు, విశ్లేషకుడు కృష్ణంరాజు మాట్లాడుతూ.. ‘‘చంద్రబాబు అమరావతి దేవతల రాజధాని అంటున్నారు, కానీ ఇది సెక్స్ వర్కర్లకు నిలయం. ఇక్కడే ఎక్కువ మంది వేశ్యలు ఉన్నారు. వారికోసం ఎన్నో స్వచ్ఛంద సంస్థలు పనిచేస్తున్నాయి’’ అంటూ వ్యాఖ్యానించారు అని దీనిపై దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన తెలియజేసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు.
రాజధాని అమరావతి మహిళలను కించపరిచిన వారు వెంటనే క్షమాపణలు చెప్పాలని అల్టిమేటమ్ జారీ చేశారు. మహిళలపై తప్పుడు కూతలు కూసిన కృష్ణంరాజుకు మహిళల చేతిలో చెప్పుదెబ్బలు తప్పవన్నారు. డిబేట్ నిర్వహించిన కొమ్మినేని కూడా క్షమాపణ చెప్పాల్సిందేనన్నారు. సాటి మహిళలను అగౌరవపరుస్తుంటే ఖండించకుండా ఉన్నందుకు భారతిరెడ్డి కూడా బాధ్యురాలేనని, ఆమె కూడా మహిళలకు క్షమాపణ చెప్పాలన్నారు. ఐదేళ్లు అమరావతి ఉద్యమం చేసి రాష్ట్రమంతా పాదయాత్రలు చేసి వైసీపీకి 11 సీట్లు మాత్రమే వచ్చేటట్టు చేసి సత్తా చాటిన అమరావతి మహిళలపై విషం చిమ్మిన సాక్షి చానల్ మూసే వరకు మరో ఉద్యమం చేపడతామని మహిళలు ప్రకటించారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆర్యవైశ్య డైరెక్టర్ కొత్త కొండబాబు, మహిళా శక్తి కమిటీ సభ్యులు పోలినాటి ధర్మానందకుమారి, నకిరెడ్డి సూర్య వతి, గెద్దాడ సత్యవేణి, గుమ్మల అనంతలక్ష్మి, గొల్లవిల్లి శ్రీదేవి, రాపాక లక్ష్మి, ఎల్లాటిఅమ్మాజీ, చెక్కా మరియా, తిప్పన సత్యవతి, బద్ది సురేష్, మోరుకుర్తి రాజు తదితరులు పాల్గొన్నారు.