కాకినాడ జిల్లా నూతన కలెక్టర్ ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ను మర్యాదపూర్వకంగా కలిసిన టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్
కాకినాడ జిల్లా నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన ఎం.ఎన్. హరేంధిర ప్రసాద్ ని టీడీపీ కాకినాడ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ కలెక్టర్ కి పట్టు శాలువాతో సన్మానించి, పుష్పగుచ్ఛం, జ్ఞాపిక అందించి అభినందనలు తెలియజేశారు. జిల్లా అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై వారు చర్చించారు.

