కాకినాడ జిల్లా కాకినాడ: ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం విద్య వైద్యానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నప్పటికీ కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రి మాత్రం అధికారుల నిర్లక్ష్య ధోరణిలో నిర్వహణ జరుగుతుంది.
కాకినాడకి చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాల నుండి కూడా సుదీర్ఘదూరాల నుండి ఈ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం ఎందరో రోగులు వస్తుంటారు. ఇటువంటి తరుణంలో ఎంతో బాధ్యతగా విధి నిర్వహణ చేపట్టవలసిన అధికారులు నిర్లక్ష్య ధోరణిలో ఎవరికి వారే యమునా తీరు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. దీనికి ఉదాహరణ చూడడానికి కార్పొరేట్ హాస్పిటల్ మాదిరిగా కనిపించే మెడికల్ విభాగం చూడడానికి మాత్రమే కార్పొరేటర్ ఆసుపత్రి మాదిరిగా ఉంటుంది లోపలికి వెళ్లి చూస్తే రోగులకు మాత్రం ఒక్కొక్క బెడ్ కు ఇద్దరు పేషెంట్లను ఓకే బెడ్ పై వేస్తుంటారు.
రోగం బారిన పడి చికిత్స చేయించుకుందామని వచ్చేసరికి ఒక రోగి పక్కన మరో రోగిని వెయ్యడం వల్ల కాకినాడ ప్రభుత్వాసుపత్రికి వచ్చే రోగులు ఇబ్బందులకు గురవుతున్నారు. అయినప్పటికీ పట్టించుకునే నాధుడే లేడు. మూత్రశాలలు కూడా శుభ్రపరచకుండా కనీసం పెన్ ఆయిల్ కూడా ఉపయోగించకుండా తూ తూ మంత్రంగా క్లీనింగ్ సిబ్బంది కాలం వెళ్లబుచ్చుతున్నారు.
ఈ విషయం ఇలా ఉండగా దూర ప్రాంతాల నుండి అనారోగ్యం బారిన పడిన రోగులు ఆటోలలో ఆసుపత్రికి చేరుకున్న తర్వాత రోగికి సహాయం చేయడానికి ఆటో డ్రైవర్ లోపలికి వెళ్లి దిగబెట్టి వచ్చేలోగా ఆటో అడ్డుగా ఉంది అంటూ సెక్యూరిటీ సిబ్బంది ఆటో చక్రాలలో గాలిని తీసి ఆటో డ్రైవర్లకు ఇబ్బందులు గురి చేస్తున్నారు. కార్లకు బైక్ లకు పార్కింగ్ ఇచ్చిన మాదిరిగా ఆటోలకు కూడా పార్కింగ్ చూపించాలంటూ రోగులను తీసుకొచ్చి ఆటో డ్రైవర్లు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు నాయకులు స్పందించి ప్రభుత్వ ఆసుపత్రిలో అన్ని విధాలుగా సౌకర్యాలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని రోగులు తమ ఆవేదనను వ్యక్తపరుస్తున్నారు.