Hot Posts

6/recent/ticker-posts

కడప దర్గా దర్శించుకున్న కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్

మహానాడు విజయవంతంగా పూర్తి అవ్వాలని 

కడప అమీన్ పీర్ దర్గాలో ప్రార్థనలు 

నిర్వహించిన జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్

ANDRAPRADESH: ఆంధ్రప్రదేశ్ లో గల కడప జిల్లా లోని కడప నగరంలో నకాష్ వీధి  లో  అమీన్ పీర్ దర్గా (పెద్ద దర్గా)ను దర్శించుకుని ముస్లిం మత పెద్దల నుండి దర్గా విశిష్టత ను అడిగి తెలుసుకున్న కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ జ్యోతుల నవీన్. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ దర్గా దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రసిద్ధి గాంచిన దర్గా అని దీనిని దక్షిణ భారతదేశపు ఆజ్మీర్ అనికూడా అంటారు. అంత విశిష్టత కలిగిన ఇది తగ్గాలో ప్రకృతి వైపరీత్యాల నుండి కాపాడుతూ మహానాడు విజయవంతంగా మూడు రోజులు పూర్తి చేసుకోవాలని ప్రార్థించామన్నారు. 

అనంతరం మహానాడు పనులను మంత్రి నిమ్మల రామానాయుడు తో కలిసి పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర టిడిపి కార్యదర్శి మీసాల రాజు, రాష్ట్ర తెలుగు యువత ఉపాధ్యక్షులు అడబాల వెంకటేశ్వరరావు, తూము కుమార్ తదితరులు పాల్గొన్నారు.