ANDRAPRADESH, KAKINADA: కాకినాడ జిల్లా ఎస్పీ జి. బిందు మాధవ్ ఐపీఎస్ వారు జిల్లాలో ఎక్కడా గంజాయి అక్రమ రవాణా, అమ్మకాలు ఉండటానికి వీల్లేదని అదేవిధంగా నేషనల్ హైవే మీద నిఘా పెట్టి గంజాయి ట్రాన్స్పోర్టేషన్ పూర్తిగా అరికట్టాలని, NH-16 మీద నిఘా పెట్టి విస్తృత వాహన తనిఖీలు చేపట్టాలని ఆదేశాలు జారీ చేయడం జరిగింది.
ఎస్పీ జి. బిందు మాధవ్ ఆదేశాల మేరకు కిర్లంపూడి మండల పరిధిలో కృష్ణవరం టోల్ ప్లాజాకి సమీపంలో vehicle చెకింగ్ చేస్తుండగా ఒక బొలెరో కారు, ఒక మారుతి బ్రేజా కారు స్వాధీనం చేసుకుని 4 మంది పురుషలు, 2 మహిళా ముద్దాయిలు, ఒక చైల్డ్ కన్ఫ్లిక్ట్ విత్ లా లను అదుపులోకి తీసుకొని వారి వద్ద 163.250 కేజీల గంజాయిని 8 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగింది
వివరాలు లోనికి వెళ్ళితే 26వ తేదీన ఉదయం 1) SK. మస్తాన్ వల్లి, గోపాలపట్నం, విశాఖపట్నం 2) SK షరీఫ్, అల్లిపురం, 3) K. నాయుడు, బలిఘట్నం, నర్సీపట్నం, 4) Ch. సతీష్, బలిఘట్నం, నర్సీపట్నం, 5) అనామిక, 6) కుమారి అనామిక, 7) చైల్డ్, గోపాలపట్నం, విశాఖపట్నం, సదరు ముద్దాయిలు ప్రయాణికుల ముసుగులో చిత్రకొండ, ఒడిశాకి చెందిన ముగ్గురు వ్యక్తులు సహకారంతో బెన్న భూపాల పట్టణం నుండి మహారాష్ట్ర రాష్ట్రం షిరిడీకి చెందిన ఒక వ్యక్తికి రెండు వాహనాలలో గంజాయి అక్రమ రవాణా చేస్తుండగాపై ముద్దాయిలను పట్టుకోవడం జరిగినది.
వారి వద్ద మొత్తం 163. కిలోల 250 గ్రాములు గంజాయి (75 ప్యాకెట్లలో ప్యాక్ చేయబడినది), ధర రూ. 8,16,250/- విలువైన గంజాయి, ఒక బొలెరో PLS 2WD వాహనం (నంబరు: WB38AC0489) విలువ రూ. 2,50,000/-, ఒక స్విఫ్ట్ బ్రెజ్జా కారు (AP39SE5686) విలువ రూ. 2,50,000/-, ఎనిమిది స్మార్ట్ఫోన్లు విలువ రూ. 40,000/, నగదు రూ. 880/- ముద్దాయిల వద్ద స్వాధీనం చేసుకొని కిర్లంపూడి పోలీస్ స్టేషన్ లో Cr.No. 61/2025 U/Sec.8(c) r/w 20(b) (ii) (C) NDPS గా కేసు నమోదు చేయడమైనది.
కాకినాడ జిల్లా ఎస్పీ శ్రీ బిందు మాధవ్ ఐపీఎస్ వారి పర్యవేక్షణ లో పెద్దాపురం ఎస్డిపిఓ శ్రీ హరి రాజు ఆధ్వర్యంలో ముద్దాయిలను అరెస్ట్ చేసిన జగ్గంపేట CI YRK, దర్యాప్తులో పాల్గొన్న కిర్లంపూడి ఎస్సై జి సతీష్, జగ్గంపేట SI T. రఘునాథరావు, సిబ్బంది IW కృపారావు, గండేపల్లి వీరబాబు, జగ్గంపేట శ్రీను పాల్గొన్నారు. CI, SI, సిబ్బందికి అభినందనలు తెలియజేశారు.