ANDRAPRADESH, PARKSHAM: ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెం (వై.పాలెం) నియోజకవర్గంలో తమ్ముళ్ల మధ్య వర్గ పోరు సాగుతోంది. ఒకరిపై ఒకరుఆధిపత్య ధోరణి ప్రదర్శించుకుంటూ.. రోడ్డున పడుతున్నారు. ఎవరికి వారుగా రాజకీయాలు చేసుకుంటున్నారు. పార్టీ తరపున ఇక్కడ మినీ మహానాడు కూడా తూతూ మంత్రంగానే నిర్వహించి.. చేతులు దులుపుకొన్నారు. గత ఎన్నికల్లో ఇక్కడ నుంచి తాటిపర్తి చంద్రశేఖర్ విజయం దక్కించుకున్నారు. ఈయన నిదానస్తుడనే పేరు తెచ్చుకున్నారు.
కానీ, ఇంచార్జ్గా ఉన్న ఎరిక్షన్ బాబుకు, మరో నేత మన్నె రవీంద్ర బాబుకు మధ్య ఏమాత్రం పొసగడం లేదు. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. వీరిలో ఎవరూ తగ్గకపోవడంతో రాజకీయాలు రోడ్డున పడుతున్నాయి. మహానాడు వేదికగా.. పార్టీ సిద్దాంతాలు.. నాయకుల మధ్య సఖ్యత పెంచేందుకు పార్టీ అధిష్టానం ప్రయత్నాలు చేస్తోంది. కానీ, ఈ తరహా రాజకీయాలకు వీరు సిద్ధం కాకపోవడంగమనార్హం. అంతేకాదు.. నువ్వు తిన్నావంటే.. నువ్వు తింటున్నావంటూ.. ఆరోపించుకుంటున్నారు.
ఈ వివాదాలు గత ఆరు మాసాలుగా చోటు చేసుకుంటున్నా.. పార్టీ అధిష్టానం వరకు వెళ్లకుండా.. ఎమ్మెల్యే నే కాపు కాస్తున్నారు. కానీ, ఇప్పుడు మన్నే వర్గం.. ఎమ్మెల్యేను కూడా విస్మరించి.. ఆయన ఉదాశీనతవల్లే పార్టీని నష్టపరుస్తున్నారని వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది. మరోవైపు.. ఎరిక్షన్ బాబు వర్గం కూడా.. మన్నే వర్గం వల్లే పార్టీ కార్యక్రమాలకు విఘాతం కలుగుతోందని.. పార్టీ తరఫున మాట్లాడమంటే.. వైసీపీ వర్గానికి కొమ్ముకాస్తున్నారని ఎదురుదాడి ముమ్మరం చేస్తున్నారు.
ఈ పరిణామాలపై ఎమ్మెల్యే చంద్రశేఖర్ మౌనంగా ఉన్నారు. ఎవరిని ఏమంటే ఏం జరుగుతుందో అన్నది ఆయన భావన అంతేకాదు... ఎవరితోనూవివాదాలకు పోకుండా తన పనితాను చేసుకుని పోతున్నారు. కానీ.. అటు ఎరిక్షన్ వర్గం.. ఇటు మన్నే వర్గం రెండూ కూడా సై అంటే సై అంటూ దూకుడుగా వ్యవహరి స్తున్నాయి. దీంతో తమ్ముళ్ల మధ్య వర్గ పోరు పెరిగి.. పార్టీలో ఐక్యతకు విఘాతం కలిగిస్తోందన్నది వాస్తవం. పనుల నుంచి కార్యక్రమాల వరకు కూడా సఖ్యత లేకపోగా విమర్శల పర్వంలో తమ్ముళ్లు తీరిక లేకుండా వ్యవహరిస్తున్నారు.