అమరావతి,కాకినాడ జిల్లా : ప్రతిక్షణం జగ్గంపేట ప్రాంతానికి సాగునీరు, త్రాగునీరు అందించాలని దృఢ సంకల్పంతో పనిచేస్తున్న జగ్గంపేట శాసనసభ్యులు, తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులు జ్యోతుల నెహ్రూ . జగ్గంపేట నియోజకవర్గం లోని ప్రతి గ్రామానికి గోదావరి నుండి శుద్ధిచేసిన మంచినీళ్లు ప్రతి ఒక్కరికి ఫిల్టర్ వాటర్ అందించాలని ఒక నివేదిక తయారు చేసుకుని అమరావతిలోని సచివాలయ కార్యాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడుకి ఆ నివేదిక అందించారు.
వెంటనే చంద్రబాబు నాయుడు ఆ నివేదిక అంతా పరిశీలించి సానుకూలంగా స్పందించారు. అనంతరం ఆళ్లగడ్డ శాసనసభ్యురాలు భూమా అఖిలప్రియ తో కలిసి లక్ష్మీనరసింహస్వామి ప్రతిమను ముఖ్యమంత్రి చంద్రబాబుకు అందించారు.

