Hot Posts

6/recent/ticker-posts

ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ చేతుల మీదుగా రైతులకు దానా పంపిణీ


ప్రభుత్వం అందిస్తున్న50 % సబ్సిడీతో పశువుల దాణా రైతులకు అందజేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ

కాకినాడ జిల్లా, జగ్గంపేట: జగ్గంపేట మండలం ఇర్రిపాక రైతు భరోసా కేంద్రంలో రైతులకు మేలు రకమైన పశువుల దానా పంపిణీ చేసిన జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ నాలుగు టన్నుల దాన ఇర్రిపాక గ్రామానికి మొత్తం 15 మంది పాడి రైతులకు అందించడం జరిగింది. పంతం బాబు,

చీపురుపల్లి నాయుడు, మగపు గంగరాజు, గొర్రిపాఠి సత్యనారాయణ, గొర్రిపాఠి భాస్కర్, పిండి మహేష్,

లావుడు అప్పారావు,మగపు లక్ష్మి,పిండి వెంకటేశ్వరావు. తదిత రైతులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  పాడి రైతులకు మేలు రకమైన దాణాను 50% సబ్సిడీతో అందించడం జరుగుతుంది.1110/- రూపాయల ధర కలిగిన 50 కేజీల దానాను 50% సబ్సిడీతో అంటే కేవలం 555 /-  రూపాయలు రైతు చెల్లించినచో 50 కేజీల దానను అందించడం జరుగుతుంది అన్నారు  ఒక్కొక్క రైతుకు మూడు పశువులకు గరిష్టంగాను నెలకు 150 కేజీలు అదే మూడు నెలలకు గాను 450 కేజీలు దానాను బుక్ చేసుకోవచ్చును రైతులకు పాడి రైతులు భారత్ పసుధాన్ యాప్ నందు నమోదై ఉండవలెను. పశువులకు చెవిపోగులు వేసి ఉండవలెను, టీకాలు సకాలంలో వేయిస్తున్న  పశువులు అర్హత కలిగి ఉండును.ఎస్సీ ఎస్టీ మరియు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న పాడి రైతులు అర్హులుఅన్నారు.

పాడి పశువులను కలిగిన రైతు గ్రామంలో ఉన్న రైతు సేవా కేంద్రం వద్దకు వెళ్లి పశువుల దానను బుక్ చేసుకొనవచ్చును తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, రైతులు పాల్గొన్నారు.