కాకినాడ జిల్లా ఎస్పీ G. బిందు మాధవ్ వారి ఆదేశాల మేరకు కాకినాడ జిల్లా : జగ్గంపేట సర్కిల్ పరిధిలోగండేపల్లి మండలం నాయకంపల్లి గ్రామంలో పేకాట రాయుళ్లు పై దాడి చేసి 7 మంది పేకాట రాయుళ్లనుఅరెస్ట్ చేసి 2200/- రూపాయలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసిన గండేపల్లి ఎస్సై శివ నాగబాబు గండేపల్లి పోలీసులు 12 మందినీ జగ్గంపేట పోలీసులు 8 మంది నీ మొత్తం 20 మందిని జూద క్రీడలకు పాల్పడిన వారిని సంబంధిత గౌరవ మండల ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ వారి వద్ద హాజరు పరిచి సత్ప్రవర్తన కొరకు బైండ్ ఓవర్ చేయటం జరిగింది.
జగ్గంపేట, గండేపల్లి , కిర్లంపూడి మండలాల్లో ఎక్కడైనా కోడిపందాలు, గుండాటలు పేకాటలు, బొమ్మ బరుసు, ఎత్తులాట, కోత బంతి ఎత్తు లాట లాంటి జూద క్రీడలకు ఎవరు పాల్పడినా కాకినాడ జిల్లా పోలీస్ వాట్సాప్ నెంబర్94949 33233 9440796529 లేదా 9440796508 ,లేదా 100 లేదా 112 కు సమాచారం ఇవ్వ వలసినదిగా జగ్గంపేట సీఐ వై ఆర్ కె తెలియ చేశారు


