Hot Posts

6/recent/ticker-posts

ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూను సత్కరించిన న్యాయవాది కామా చారి


 ఎమ్మెల్యే జ్యోతుల  నెహ్రూను     మర్యాద పూర్వకంగా కలిసిన అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కౌన్సిల్     న్యాయవాది    రామోజీ  నాగ  సత్యా     వెంకట కామా చారి

కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక రావులమ్మ నగర్ లోని  ఎమ్మెల్యే   క్యాంప్   ఆఫీసులో   కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం,ఏలూరుఅర్బన్ డెవలప్మెంట్ అథారిటీ హైకోర్టు స్టాండింగ్ కౌన్సిల్ న్యాయవాదిగా   నూతనంగా    నియమితులైన గుంటూరు జిల్లా తాడేపల్లికి చెందిన రామోజు నాగ వెంకట కామాచార్యులు జగ్గంపేట ఎమ్మెల్యే, టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూను మర్యాద పూర్వకంగా కలిసి ఈ పదవి రావడానికి కృషిచేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ను ఘనంగా సత్కరించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా   ఎమ్మెల్యే   నెహ్రూ మాట్లాడుతూ నిబద్ధత, నిజాయితీతో పని చేసే అడ్వకేట్ కామాచార్యులు ను ప్రభుత్వం గుర్తించి ఆయనకు ఈ పదవి ఇచ్చిందని ఈ పదవికి వన్నె తెచ్చే విధంగా ఆయన పని చేస్తారని ఆయన ఆధీనంలో ఐదు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలు, నాలుగు కార్పొరేషన్ లు, 25 మున్సిపాలిటీలు, 1400 గ్రామపంచాయతీలు ఉన్నాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అన్నవరం దేవస్థానం రిటైర్డ్ పిఆర్ఓ తులా రాము పాల్గొన్నారు.