వైసీపీ నుండి పలువురు ముస్లింలుతెలుగుదేశం పార్టీలోచేరిక
పార్టీ కండువాలతో స్వాగతం పలికిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక రావులమ్మ నగర్ లో గల ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో గోకవరం సొసైటీ చైర్మన్ గాజింగం సత్తిబాబు ఆధ్వర్యంలో జగ్గంపేట శాసనసభ్యులు జ్యోతుల నెహ్రూ సమక్షంలో గోకవరం టౌన్ కు చెందిన పలువురు ముస్లింలు షేక్ మదీనా సాహెబ్, ఎస్ కే సంటి సాహెబ్, ఎస్కే శ్రీ మదీనా. శ్రీను,ఎస్కే ఫిరోజ్ ఆలీషా, ఎస్ ఎస్ ఎస్కే మహమ్మద్ అలీ, ఎస్ కే పఖిర్ మహమ్మద్, ఎస్.కె పాప సాహెబ్, ఎస్కే రజక్వల్లి, ఎస్.కె మదీనా (చిన్న) తదితర ముస్లిం సోదరులతోపాటువైసిపికాపు నాయకులు వెలిశెట్టి శివ, పదిలం సూరిబాబు తదితరులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరందరికీ ఎమ్మెల్యే నెహ్రూ తెలుగుదేశం పార్టీ కండువాలు వేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కి చెందిన పలువురు కుటమి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తూ అమరావతి, పోలవరం, నిర్మాణాలను పూర్తి చేసుకుంటూ సూపర్ సిక్స్ పథకాలను ఒక్కొక్కటిగా అమలు చేసుకుంటూ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పరుగులు పెట్టిస్తున్న నేపథ్యంలో వైసీపీకి చెందిన అనేకమంది తెలుగుదేశం పార్టీలో చేరేందుకు సిద్ధమవుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలోగోకవరం సొసైటీ చైర్మన్ ఘాజింగం సత్తిబాబు, మారిశెట్టి భద్రం, పిల్ల చంటిబాబు, ఎస్ బాబు, గుబ్బలమ్మ గుడి చైర్మన్ ఆచంట రాజు, పోసిన ప్రసాద్, గోకవరం టౌన్ ప్రెసిడెంట్ పైలా శ్రీనివాసరావు, రాష్ట్ర ఎస్సీ సెల్ కమిటీ అధ్యక్షులు గునిపే భరత్, మేడిశెట్టి వీరబాబు, జి.సన్యాసిరావు, వెన్ను వీరబాబు తదితరులు పాల్గొన్నారు.
