జగ్గంపేటలో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన
కాకినాడ జిల్లా జగ్గంపేట స్థానిక గోకవరం రోడ్డులోని మోడ్రన్ డిగ్రీ కళాశాలలో జ్యోతుల నెహ్రూ ఫౌండేషన్, వికాస ఆధ్వర్యంలో శనివారం నిర్వహించిన మెగా జాబ్ మేళా కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ముందుగా కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతులనవీన్ హాజరై వచ్చిన అభ్యర్థుల అందర్నీ పేరుపేరునా పలకరించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిర్వహించిన సభలో వికాస పీడీ లక్ష్మణరావు మాట్లాడుతూ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ, జ్యోతుల నవీన్ ఆధ్వర్యంలో జగ్గంపేట నియోజకవర్గం నిరుద్యోగులందరికీ ఉద్యోగ అవకాశాలు కల్పించాలని 33 బ్రాండెడ్ కంపెనీలతో నిర్వహించిన ఈ మెగా జాబ్ మేళాకు 1206 అభ్యర్థుల హాజరై ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. దాదాపు 729 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిందని తెలియజేశారు. జ్యోతుల నవీన్ మాట్లాడుతూ నియోజవర్గంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వికాస ఆధ్వర్యంలో ఈ యొక్క మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగిందని ఈ జాబ్ మేళా ఉపయోగించుకుని ఉద్యోగ అవకాశాలు పొందాలని అన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ.. వికాస ఆధ్వర్యంలో లక్ష్మణరావుని మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం జరిగిందని ఈ జాబ్ మేళా ప్రముఖ కంపెనీలు ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నాయని ఈ ఇంటర్వ్యూలో పాల్గొని ఉద్యోగాలు అందిపుచ్చుకుంటే మీ తల్లిదండ్రులను ఆనందించే విధంగా మీరు ఏదో ఒక ఉద్యోగంలో జాయిన్ అవుతే మీ తల్లిదండ్రుల ఆనందానికి అవధులు ఉండవని అన్నారు. అందుకే ఈ చిరు ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో అడపా భరత్ బాబు, తోట రవి, తోట గాంధీ, కొత్త కొండబాబు, అడబాల భాస్కరరావు, బస్వా వీరబాబు, మారిశెట్టి భద్రం, పోతుల మోహనరావు, చదరం చంటిబాబు, జంపన సీతారామచంద్ర వర్మ, నీలం శ్రీను, దేవరపల్లి మూర్తి, పాలచర్ల నాగేంద్ర చౌదరి, తూము కుమార్, తదితరులు పాల్గొన్నారు.