ప్రతి ఒక్కరుపర్యావరణాన్ని పెంపొందించడానికి కృషి చేయాలి
కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన
కాకినాడ జిల్లా జగ్గంపేట : గ్రామపంచాయతీ సెక్రెటరీ జి శివ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం వేడుకలకు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు, జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ జ్యోతుల నవీన్ జగ్గంపేట సత్యవేణి పేటలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ పచ్చదనం పెంపే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని అందులో భాగంగా మొక్కలను నాటాలని ఆదేశించారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సామూహికంగా పెద్దఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం చేపట్టిందని తెలిపారు. ప్లాస్టిక్ రహిత సమాజాన్ని తీసుకొచ్చినప్పుడే మొక్కలు సమృద్ధిగా పెరుగుతాయని వాయు కాలుష్యాన్ని తగ్గించవచ్చని దీనివల్ల ప్రతి ఒక్కరికి మంచి ఆరోగ్యం, స్వచ్ఛమైన గాలి నీరు లభిస్తాయని నవీన్ తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎస్ అప్పలరాజు, మారిశెట్టి భద్రం, జీను మణిబాబు, కొత్త కొండబాబు, పరిమి బాబు, పాండ్రంగి రాంబాబు, రేఖబుల్లి రాజు, ఎంపీడీవో చంద్రశేఖర్, ఈవోపీఆర్డి భాస్కర్, కోండ్రోతు శ్రీను, పీల మహేష్, గెద్దాడ సత్యవేణి, ఉపాధి ఏపీఓ, తదితరులు పాల్గొన్నారు.