Hot Posts

6/recent/ticker-posts

ఊపిరి పీల్చుకోవాలంటే మొక్కలు పెంచాలి


పాటంశెట్టి సూర్యచంద్ర సామాజిక ఉద్యమకారుడు కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి మండలం బూరుగుపూడి

అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, మన ఇంటి వద్దనే ఇంటిపంట ద్వారా ఆకుకూరలు కూరగాయలు పండించడం వల్ల ఆనందం, ఆరోగ్యం, ఆర్థికాభివృద్ధి జరుగుతుందని, తమ ఇంటి వద్ద నిర్వహిస్తున్న ఇంటిపంట,వర్మి కంపోస్ట్ విధానాలను స్వయంగా చూపిస్తూ వివరించారు. ప్రతి మనిషి రోజుకి 20 వేల నుండి 22 వేల సార్లు ఊపిరి తీసుకుని వదులుతామని మనం తీసుకునే గాలిలో ప్రాణవాయువైన ఆక్సిజన్ ని మొక్కలు ఇస్తాయని, మనం విడుదల చేసే కార్బన్ డయాక్సైడ్ మొక్కలు తీసుకుంటాయని మనిషి లేకపోయినా మొక్క పెరగగలదని, మొక్క లేకపోతే మానవులతోపాటు సకల జీవరాసులకు మనుగడ ఉండదని సూర్యచంద్ర స్పష్టం చేశారు. 

ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజున వనమహోత్సవం పేరుతో గౌరవ ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు ఈ ఒక్క రోజులో కోటి మొక్కలు నాటాలని పిలుపునివ్వడం శుభపరిణామం అన్నారు. నాటిన ప్రతి మొక్క వృక్షం అయ్యేవరకు సంరక్షించే విధంగా నాటిన ప్రతి మొక్కకు ఒక కోడ్ నెంబర్ ఇచ్చే విధంగా ప్రతి మూడు నెలలకు ఆ మొక్క స్టేజ్ ఫోటో తో సహా ప్రభుత్వానికి నివేదించే విధంగా ఏర్పాటు చేసినట్లయితే వేల కోట్ల రూపాయలు ఆదాయం ప్రభుత్వం సృష్టించవచ్చని ఆ దిశగా ప్రభుత్వంఆలోచించాలనిహరితాంధ్రప్రదేశ్ సాధన అందరి బాధ్యతగా భావించాలని పాటంశెట్టి సూర్యచంద్ర కోరారు