ANDRAPRADESH: టీడీపీ జెండాపై పలుమార్లు విజయం దక్కించుకున్న వల్లభనేని వంశీ.. 2019 తర్వాత.. తనపై కేసులు పెట్టడం ఖాయమని తెలిసి.. ఆయన పార్టీ మారారు.
మార్పు మంచిదే. రాజకీయాల్లోనూ ఇది వర్తిస్తుంది. అయితే.. ఈ మార్పు ప్రజలు ఆశిస్తే.. ఒకరకంగా ఉంటుంది. పార్టీలు ఆశిస్తే.. మరో విధంగా ఉంటుంది. 2024 ఎన్నికలనే తీసుకుంటే.. మార్పు కోరుకున్న ప్రజలు నాయకులు ఎవరన్నది కూడా చూడకుం డా కూటమి పార్టీలకు ఓట్లు గుద్దేశారన్న చర్చ ఉంది. అయితే.. ఇదేసమయంలో మార్పు కోరుకుంటూ.. వైసీపీ అనేక ప్రయత్నా లు చేసినా ఏ ఒక్కటీ ఫలించలేదు. ఫలితంగా మార్పు అనేది ప్రజలు కోరుకుంటే తప్ప.. రాదని స్పష్టమైంది. ఇక, ఇప్పుడు కీలకమైన గన్నవరం నియోజకవర్గంలోనూ ఇదే చర్చ జరుగుతోంది.
టీడీపీ జెండాపై పలుమార్లు విజయం దక్కించుకున్న వల్లభనేని వంశీ.. 2019 తర్వాత.. తనపై కేసులు పెట్టడం ఖాయమని తెలిసి.. ఆయన పార్టీ మారారు. ఈ క్రమంలోనే వైసీపీ తరఫున ఆయన పనిచేశారు. అయితే.. ఈ మార్పును ప్రజలు హర్సించలే దు. అందుకేవ్యవస్థాగత ఓటు బ్యాంకు కూడా వంశీకి దూరమైంది. అప్పటి వరకు ఆయన వెంటే ఉ న్నారని భావించిన వారు కూడా ప్రజల నాడి తెలుసుకుని ఆయనను వదిలేశారు. దీంతో గత ఎన్నికల్లో యార్లగడ్డ వెంకట్రావు విజయం దక్కించుకున్నా రు.సరే.. ఇప్పుడు గతంలో చేసిన పాపాలు వంశీని వెంటాడుతున్నాయన్న చర్చ కూడా ఉంది.
దీంతో ఆయన బెయిల్పై బయటకు రాలేకపోతున్నారు. కేసులపై కేసులు నమోదవుతూనే ఉన్నాయి. ఒక దానిలో బెయిల్ వస్తే.. మరో కేసులో ఆయన జైలుకు వెళ్తున్నారు. పలితంగా నాలుగు మాసాల నుంచి కూడా వంశీ జైల్లోనే ఉంటున్నారు. ఈ పరిణామంతో వైసీపీ వ్యూహాత్మక ఎత్తుగడ కింద.. ఇప్పుడు ఆయన సతీమణి పంకజ శ్రీని రాజకీయాల్లోకి తీసుకువస్తున్న వార్తలు వస్తున్నాయి. అయితే.. ఆమెను ప్రజలు కోరుకుంటున్నారా? అంటే.. లేదు. ఇది కేవలం పార్టీ మార్పు మాత్రమే. అంటే..ఒక ప్రయోగం. పైగా.. ఎన్నికలకు నాలుగు సంవత్సరాల ముందు.. జరుగుతున్న ప్రయోగం. దీనిపైనే ఇప్పుడు చర్చసాగుతోంది.
ఒక వ్యక్తి కారణంగా మరో వ్యక్తికి సింపతీ రావాలన్నా.. కుటుంబానికి సింపతీ పెరగాలన్నా.. ఎన్నికలకు నాలుగు సంవత్సరాల ముందు సాధ్యం కాదన్నది మేధావులు చెబుతున్న మాట. ఇది గతంలోనూ రుజువైంది. వైఎస్ 2009లో చనిపోతే.. ఆ సెంటిమెంటు తనకు వస్తుందని జగన్ అనుకున్నారు. కానీ, అది 2014 వరకు నిలవలేదు. కానీ, 2019లో ఎన్నికలకు ముందు వరకు పాదయాత్ర చేసిన దరిమిలా.. అది పనిచేసింది. సో.. ఇలా చూసుకుంటే నాలుగేళ్ల ముందుగానే.. పంకజశ్రీని రంగంలోకి దింపుతున్నారు. పైగా కమ్మ సామాజిక వర్గం వైసీపీకి దూరంగా ఉన్ననేపథ్యంలో ఆమె ప్రభావం ఏమేరకు పడుతుందన్నది చూడాలి. సో.. పంకజ శ్రీతో ఫంకా(ఫ్యాన్) ఏమేరకు తిరుగుతుందన్నది ప్రశ్నార్థకం.