Hot Posts

6/recent/ticker-posts

సమ్మె బాట పట్టిన పురపాలక సంఘ కార్మికులు





* *23వ రోజుకు చేరుకున్న పెద్దాపురం లో మున్సిపాలిటీ సిబ్బంది సమ్మె*

కాకినాడ జిల్లా: పెద్దాపురం లో పురపాలక కార్యాలయం సిబ్బంది అత్యవసర విభాగాలైన నీటి సరఫరా వీధి దీపాల నిర్వహణ కార్మికులు సమ్మెబాట పట్టారు ఇప్పటికీ 23 రోజులు కావస్తున్న ప్రభుత్వం నుండి కానీ అధికారుల నుండి కానీ ఎటువంటి స్పందన లేదు,

ప్రస్తుతం వారి కి 15వేల రూపాయలు వేతనం ఇస్తూ ప్రభుత్వ ఉద్యోగులుగా చూపించి ప్రభుత్వాల నుండి వచ్చే పథకాలకు అర్హత లేదంటూ వారికి ఎటువంటి పథకాలు అందటం లేదని కార్మికులంతా తమ ఆవేదన వ్యక్త పరుస్తున్నారు.

వారి కోరికలు నెరవేరేవరకు సమ్మె కొనసాగిస్తామని 15 సంవత్సరాలు పైబడిన వారందరినీ క్రమబద్ధీకరణ చేయాలని, టెక్నికల్ కార్మికులకు 29200 వేతనం చెల్లించాలని నాన్ టెక్నికల్ కార్మికులకు 24 500 రూపాయలు వేతనం చెల్లించాలని, ప్రభుత్వ పథకాలన్నీ వర్తించేలా చేయాలని, విధి నిర్వహణ లో చనిపోయిన కార్మికునికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్ గ్రేషియా ఇవ్వాలి ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి.

దీర్ఘకాలిక జబ్బులకు గురైన వారికి ప్రభుత్వం ద్వారా చికిత్స అందించి ఐదు లక్షల రూపాయలు వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, ప్రభుత్వ ఉద్యోగుల గడువు 60 సంవత్సరాల నుండి 62 సంవత్సరాల కు పెంచాలి పదవి విరమణ అనంతరం ఇతర ఉద్యోగుల మాదిరిగా  గ్రాట్యుటీ తో పాటుగా పదివేల రూపాయలు పెన్షన్ ఇవ్వాలి.

52 ఆదివారాలు దేశ రాష్ట్రీయ జాతీయ సెలవులు ఇవ్వాలని వారి డిమాండ్లను తెలియజేశారు ఈ కార్యక్రమంలో  సుంకర నాగేశ్వరరావు  బద్దలరావు కే వెంకటరమణ  ఆకుల రామకృష్ణ ఎస్.కె బషీర్ అయ్యప్ప స్వామి  వాకాడ భాస్కరరావు   పచ్చిపాల శీను  దేశెట్టి రాజు      బొమ్మన రవికుమార్ తూతిక సాయి   గుడిసే నాగేశ్వరరావు   సోనియా మళ్లీ పెద్ది భద్ర రావు పూల ప్రశాంత్ తదితరులు సమ్మెలో పాల్గొన్నారు.