Hot Posts

6/recent/ticker-posts

రంపచోడవరంలో జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ అవగాహన సదస్సు

 

**రంపచోడవరంలో ఎన్ హెచ్ ఆర్ పి ఎఫ్ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమావేశం*
*అవగాహన సదస్సు*

ANDRAPRADESH, RAMPACHODAVARAM: అల్లూరి జిల్లా రంపచోడవరం లో జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థ ఆత్మీయ సమావేశం అవగాహన సదస్సు జరిగింది ఈ కార్యక్రమానికి అధ్యక్షతన అల్లూరి జిల్లా కన్వీనర్ పులిచర్ల ప్రేమ స్వరూప్  మారేడుమిల్లి మండలం ప్రెసిడెంట్ బిల్లిగ్రహం రెడ్డి రంపచోడవరం మండల ప్రెసిడెంట్ వి ఎం కన్నబాబు  వహించారు. ముఖ్య అతిథులుగా ఎన్ హెచ్ ఆర్ పి ఫారం స్టేట్ ఇంచార్జ్ వలీ ఖాన్ మరియు   రంపచోడవరం నియోజకవర్గం ఇంచార్జ్ ఏ రాంప్రసాద్ హాజరయ్యారు. 

నియోజకవర్గ ఇన్చార్జ్ రాంప్రసాద్ మాట్లాడుతూ మనకున్న హక్కులను ఏ విధంగా కాపాడుకోవాలి వాటికి భంగం కలిగినప్పుడు ఎలా స్పందించాలి హక్కులను గురించి వివరించి అవగాహన కల్పించారు. ఎవరైనా బాధితులు ఎన్ హెచ్ ఆర్ పి ఫారం సంస్థను ఆశ్రయించినప్పుడు వారి సమస్యను ఎలా పరిష్కరించాలో క్లుప్తంగా సభ్యులకు వివరించారు. 

రాష్ట్ర ఇంచార్జ్ వలీ ఖాన్ మాట్లాడుతూ ఎన్ హెచ్ ఆర్ పి ఫారం గురించి ప్రజలకు తెలిసే విధంగా వారికి అవగాహన కలిగించి మెడికల్ క్యాంప్ నిర్వహించడం సేవా కార్యక్రమాలు నిర్వహించడం మానవతా దృక్పథంతో సేవ చేసే వారికి ఈ సంస్థలో అవకాశాలు కల్పిస్తామని సంస్థ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేసి జాతీయ మానవ హక్కుల పరిరక్షణ సంస్థని మరింత దీటుగా ప్రజలలోకి తీసుకొని వెళ్లి వారందరికీ అవగాహన కలిగించి ప్రస్తుతం సమాజంలో సామాన్యుల పట్ల జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించే విధంగా బాధితులకు న్యాయం జరిగే వరకూ పోరాడాలని సభ్యులందరికీ పిలుపునిచ్చారు. ఆశక్తి కలిగిన వారు నూతనంగా ఎన్ హెచ్ ఆర్ పి ఫారంలో చేరాలని పిలుపునిచ్చారు.

సభ్యులందరూ వారి ప్రాంతాలలో సమస్యలను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎన్ హెచ్ ఆర్ పి ఫోరం బోర్డు మెంబర్ పి ప్రభాకర్, మారేడుమిల్లి మండలం కమిటీ సభ్యులు, రంపచోడవరం మండలం కమిటీ సభ్యులు,  తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు