Hot Posts

6/recent/ticker-posts

ఐరాసలో పాక్‌కు భారత్ ధీటైన జవాబు.. మళ్లీ నోరు కూడా మెదపకుండా..!


WORLD NEWS: ఐక్య రాజ్య సమితిలో పాకిస్థాన్ కు భారత్ ధీటైన జవాబు ఇచ్చింది. ముఖ్యంగా శుక్రవారం రోజు సాయుధ సంఘర్షణలో పౌరుల రక్షణం అంశంపై చర్చ నిర్వహించగా. పాక్ రాయ్ బారి ఇండియాపై తీవ్ర ఆరోపణలు చేశారు. కశ్మీర్ అంశాన్ని లేవనెత్తి మరీ.. ఇటీవలే ఇరుదేశాల మధ్య చోటు చేసుకున్న అంశాలు, ఉద్రిక్త పరిస్థితులు గురించి ప్రస్తావించారు. దీంతో ఐరాస భారత శాశ్వత ప్రతినిధి ధీటుగా బదులు ఇచ్చారు. ఉగ్రవాదులు, పౌరులకు మధ్య తేడా చూపని పాకిస్థాన్ ప్రజల ప్రాణాలను రక్షించడం గురించి మాట్లాడే అర్హత ఏమాత్రం లేదని చెప్పుకొచ్చారు.

ఐక్యరాజ్య సమితిలో శుక్రవారం రోజు సాయుధ సంఘర్షణలో పౌరుల రక్షణం అంశంపై చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగానే పాకిస్థాన్ రాయబారి అసిమ్ ఇఫ్తికర్ అహ్మద్ మరోసారి కశ్మీర్ అంశం గురించి మాట్లాడారు. ఈక్రమంలోనే భారత్-పాక్ దేశాల మధ్య చోటు చేసుకున్న ఉద్రిక్త పరిస్థితుల గురించి ప్రస్తావించారు. దీనిపై భారత్ దీటుగా బదులు ఇచ్చింది. ముఖ్యంగా ఐరాసాలో భారత శాశ్వత ప్రతినిధి పర్వతనేని హరీశ్ మాట్లాడుతూ.. పాకిస్థాన్ ప్రతినిధి పలు అంశాలపై నిరాధారమైన ఆరోపణలు చేశారని చెప్పారు. భారత్ దశాబ్దాలుగా పాక్ ప్రాయోజిత ఉగ్రవాదులతో పోరాడుతోందన్నారు.

26/11 ముంబయి దాడుల దగ్గర నుంచి ఇటీవలే జరిగిన పహల్గాంలో అమాయక పర్యాటకులపై దాడులు చేశారని చెప్పారు. పౌరులే ప్రధాన లక్ష్యంగా దాడులకు పాల్పడుతున్నారని పహల్గాం దాడికి ప్రతి స్పందనగా భారత్ ఆపరేషన్ సిందూర్ నిర్వహించిందని అన్నారు. పాక్ లోని ఉగ్రవాదుల స్థావరాలను ధ్వంసం చేసింది చెప్పారు. అలాగే ఈ దాడుల్లో చనిపోయిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు కూడా పాకిస్థాన్ ప్రభుత్వ, పోలీస్, సైనిక అధికారులు హాజరయ్యారని గుర్తు చేశారు. ఉగ్రవాదులుస పౌరుల మధ్య తేడాను గుర్తించని ఆ దేశానికి మమ్మల్ని విమర్శించే అర్హత లేదన్ని హరీష్ పేర్కొన్నారు.

ఉగ్రవాదులను పెంచి పోషించే వారిపై కఠిన చర్యలు..!
అంతేకాకుండా పాక్ చేసిన దాడుల్లో 20 మందికి పైగా మృతి చెందారని, 80 మంది గాయపడ్డారని గుర్తు చేశారు. గురుద్వారాలు, దేవాలయాలు, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుందన్నారు. అయితే వీటిని భారత్ సమర్థవంతంగా తిప్పికొట్టిందని.. ఇలాంటి ప్రవర్తన కల్గిన ఈ దేశం కపటత్వాన్ని ప్రదర్శించడం గమనార్హం అన్నారు. అంతేకాకుండా ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ సమాజం కలిసి పోరాడాలని పిలుపునిచ్చారు. అలాగే ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పిస్తూ.. రక్షణ కల్పించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని హరీష్ ఐరాస ప్రతినిధులను డిమాండ్ చేశారు.